69 కేసులు నెగిటివ్ కలెక్టరు వి.వినయ్ చంద్
విశాఖపట్నం,వారధి న్యూస్ ఏప్రిల్ 9: ఇప్పటివరకు కరోనా నిర్ధారిత పరీక్షకు పంపిన 769 శాంపిల్స్ కు గాను ఈరోజు 69 కేసులు నెగిటివ్ వచ్చాయని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ తెలిపారు. నిన్నటి వరకు 534 నెగిటివ్ రాగా ఈరోజుతో ఆ సంఖ్య 603కి పెరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు 20 కేసులలో పాజిటివ్ వచ్చిందని, 146 కేసుల రిపోర్ట్ రావలసి ఉందని చెప్పారు.