భీమిలి నియోజకవర్గంలో జీవీఎంసి 1వార్డ్ లో సామాజిక భవనాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంబించారు.
30 లక్షలతో నిర్మించిన సామాజిక భవనాన్ని ప్రారంభించిన ఆనంతరం మంత్రి వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా అందిస్తున్న పోషకాహార కిట్లను గర్భవతులకు, బాలింతలకు అందించారు. అనంతరం జివిఎంసి పరిధిలోని భీమిలీ నియోజకవర్గం, సచివాలయ వాలంటీర్ల మార్గదర్శిని..పుస్తకాలను మంత్రి వర్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ గోవిందరావు, మండల స్థాయి అధికారులు , నాయకులు పలువురు పాల్గొన్నారు