ముఖ్యమంత్రి పిలుపుతో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ గుడివాడ లతీష్
విశాఖపట్నం ఏప్రిల్ 26 (వారధి న్యూస్) ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడంలో ఉన్న తృప్తి దేనికి సాటి రాదని 68వ వార్డు వైయస్సార్ పార్టీ నాయకులు లతీష్ అన్నారు విశాఖపట్నం న్యూస్ కరోనా వైరస్ పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గుడివాడ అప్పన్న మెమోరియల్ ట్రస్ట్ గుడివాడ యువ సేన ఆధ్వర్యంలో ఆదివారం గాజువాక లోని పలు ప్రాంతాల్లో వలస కూలీలకు 68వ వార్డు వైయస్సార్ పార్టీ నాయకులు లతీస్ నిత్యవసర సరుకుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ , ముఖ్యమంత్రి పిలుపు మేరకు పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో గుడివాడ ప్రసాద్ హుస్సెన్ చిట్టిబాబు ఏస్ శ్రీనివాస్ ఈటి సురేష్ ఉమా శంకర్ తదితరులు పాల్గొన్నారు .