కరోనా లో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం
మరిడి సంస్థ సౌజన్యం తో
విజేఫ్ ఆధ్వర్యంలో భద్రతా సామగ్రి పంపిణీ
విశాఖపట్నం ఏప్రిల్ 27 వారధి న్యూస్ కరోనా విపత్తు సమయంలో జర్నలిస్టులు అందిస్తున్న సేవలు మరువలేనివని
బాల సతీష్ కొనియాడారు,,, సోమవారం ఉదయం విజేఫ్ వినోద వేదికలో పలువురు న్యూస్ ప్రెజెంటర్స్ ఫోటో జర్నలిస్ట్ ల కు ఎలక్ట్రానిక్.. వీడియో గ్రాఫర్ లకు ప్రింట్ మీడియా జర్నలిస్టులకు... అవసరమైన భద్రతా సామగ్రి అందజేశారు,.. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులకు మాస్క్.లు . సానిటైజ ర్లు ..గ్లౌజ్ లు ... ఎలక్ట్రానిక్ మీడియా కి అవసరమైన లైవ్ స్టిక్ లు.. అందజేశారు... బాల సతీష్ మాట్లాడుతూ..కరోనా . ప్రారంభం నుంచి కూడా తమ సంస్థ ద్వారా పలువురు కి చేయూత అందించామన్నారు భవిష్యత్తులో కూడా తమ సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు , మరిడి సంస్థ డైరెక్టర్ శివాజీ మాట్లాడుతూ జర్నలిస్టులు నిరంతరం సమాజం కోసం పాటుపడుతూ సేవ చేస్తున్నారన్నారు .. జర్నలిస్టులకు ప్రతి ఒక్కరు సహకారము అందించాల్సిన అవసరం ఉందన్నారు,,,ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఇప్పటివరకు జర్నలిస్టుల కు సంబంధించి ఆరు విడతలుగా అనేక రకాల భద్రతా సామాగ్రి ని సమగ్రంగా అందచేశామన్నారు... జర్నలిస్టుల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు విజేఫ్ కార్యదర్శి ఎస్ దుర్గారావు మాట్లాడుతూ దశలవారీగా తమ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు .. ఈ కార్యక్రమంలో విజేఫ్ ఉపాధ్యక్షులు అర్. నాగరాజు పట్నాయక్
జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్..కార్యవర్గం సభ్యులు ఇరోతి ఈశ్వరరావు దొండ గిరిబాబు..జామి వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు