అక్కయ్యపాలెం లో ఆంక్షలను మరింత కఠినతరం పోలీసు అధికారులు

అక్కయ్యపాలెం లో  ఆంక్షలను మరింత కఠినతరం  పోలీసు అధికారులు


విశాఖపట్నం వారధి న్యూస్  ఏప్రిల్ 09 కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అక్కయ్యపాలెం ప్రాంతంలో గురువారం నుంచి ఆంక్షలను మరింత  కఠినతరం చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు . ఈ మేరకు హై వే కూడలి నుండి దొండపర్తి జంక్షన్,  రైల్వే న్యూ కాలనీ జంక్షన్ , తాటిచెట్ల పాలెం జంక్షన్  నుంచి అక్కయ్యపాలెం హై వే వైపు వెళ్లే అన్ని మార్గాలు చుట్టూ ఉన్న రోడ్లన్నీ కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన విషయం తెలిసిందే  . ఇప్పటికే ఈ ప్రాంతంలో కేసులు వెలుగు చూస్తుండటంతో ఆ ప్రాంతవాసులు ఇంట్లోనే ఉండేలా ఇతరులకు అనుమతించకూడదని ,రాత్రుళ్ళు  రోల్ కాల్ నిర్ణయించారు. ఈ మేరకు డిసిపి - 1 , ఎస్.రంగా రెడ్డి బుధవారం రాత్రి  మహారాణి పార్లర్ జంక్షన్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు .  ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని ఎసిపిలు,  సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ తో పాటు వార్డు వాలంటీర్లు, బందోబస్తు విధుల్లో ఉన్న  ఉపాధ్యాయులు నిర్వహించారు . 
 కాగా ఈ రోజు ఉదయం నుండి నిత్యావసర సరుకులు, కాయాగురలు, కూడా అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు . కేవలం పాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు , అదీ నిర్దిష్ట సమయంలో మాత్రమే విక్రయాలు ఉన్నాయని ప్రజలు తెలిపారు . తమ నిత్యావసర సరుకుల దుకాణాలు కూడా తెరవని కారణం గా ,  కొంతమంది తెరిచినా పోలీసులు తో ఇబ్బందులు పడలేక మూసేస్తున్నారు .  ఈ నేపద్యంలో సామాన్య ప్రజలకు వాలంటీర్లు  అందుబాటులో లేక కొన్ని ఇళ్ళకు  కూడా నిత్యావసర సరుకుల అవసరాలు  దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు . ఈ ప్రాంతంలో ఉన్న విలేకరులను కూడా బయటకు వెళ్లే వీలులేదని పోలీసులు చెబుతున్నారు . సర్వత్రా ప్రజల్లో ఈ దిగ్బంధంపై , కూరగాయల రైతు బజార్లు అందుబాటులో లేక , వెళ్ళనివ్వక పోవడంతో, నిత్యావసర సరుకుల లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.