ముస్లిం లు ఎవరి ఇంటివద్దవారే ప్రార్ధనలు చేసుకోవాలి ;ఎంపీ ఎంవీవీ

ముస్లిమ్స్ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ 






 
విశాఖపట్నం ఏప్రిల్ 27  వారధి న్యూస్ : లాక్ డౌన్ నేపథ్యంలో పరమ పవిత్ర రంజాన్ పండుగనుముస్లిం లు ఎవరి ఇంటివద్ద  వారే  నిర్వహించుకుని ప్రార్ధనలు చేసుకోవాలని విశాఖపట్నం ఎంపీ శ్రీ ఎంవివి సత్యన్నారాయణ అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో విశాఖ ఎంపీ సొంత నిధులతో పాటు హీరాపన్న జువెలర్స్ సంయుక్త నిర్వహణలో    రూ.2 లక్ష ల రూపాయల విలువైన కూరగాయలు 2 వేల మంది కి వార్డు లో అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తన పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో  ప్రజాసంక్షేమమే పరమావధిగా ప్రయత్నిస్తున్నామన్నారు.. ఈ కష్టకాలం లో ప్రజలకు తాము తోడుగావుంటానన్నారు. ఈ  క్రమంలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు      ఈ పంపిణి కార్యక్రమంలో మహేంద్ర కుమార్ జైన్ ,గోలగాని హరి,వెంకటకుమారి శ్రీనివాస్ ,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు