జిల్లా జడ్జి భానుమతి ఆదేశాలతో న్యాయవాదులు గుమస్తాలకు నిత్యావసర సరుకులు పంపిణి
విశాఖపట్నం 3 మే 2020 : గత కొద్దీ రోజులుగా లాక్ డౌన్ తో ఇబ్బందిపడుతున్న న్యాయవాదుల గుమస్తాలకు దాతల ద్వారా వచ్చిన విరాళాలతో రామ్మూర్తి నిత్యవసర వస్తువులను ఆదివారం ఉదయం జిల్లా కోర్ట్ ప్రాంగణంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు 25 కేజీల బియ్యము జిల్లా కోర్ట్ ప్రాంగణంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ బార్ అధ్యక్షులు జి. ఎం. రెడ్డి కే. వి. రామ మూర్తి లు పంపిణిచేశారు . జిల్లా జడ్జి భానుమతి ఆదేశాల మేరకు పంపిణి చేపట్టడం జరిగింది .ఈ సందర్భంగా న్యాయవాదుల గుమాస్తాలు సంతోషం వ్యక్తం చేసారు ఈ పంపిణి కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఆర్. దామోదర రావు, సెక్రటరీ అక్కరమని కొండబాబు పాల్గొన్నారు.