అమరావతి జూన్ 06 బెస్ట్ అవైలబుల్ స్కూల్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ ఇంటర్మీడియట్ పధకాలను కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్కు ఆయన లేఖ రాశారు. ఈ పథకాల కింద ఇప్పటికే 29,200 మంది విద్యనభ్యసిస్తున్నారని... వీరిలో 70% మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులున్నారని తెలిపారు. బిఎయస్, సిఈఎస్ పధకాలను ఈ విద్యా సంవత్సరం నుండి నిలిపివేయడం సరికాదని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.
సీఎం జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ